హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. 9 రోజులు అదిరే టూర్, తక్కువ ధరలో.. ప్రతి 70 మందికి!
Tue Jun 03, 2025 11:10 Business
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), ఇది భారతీయ రైల్వేకు సంబంధించిన ఆన్లైన్ టికెట్ బుకింగ్, క్యాటరింగ్ , పర్యాటక సేవలను అందించే ఒక భారత ప్రభుత్వ సంస్థ. ఐఆర్సిటిసి వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సిటిసి ద్వారా రైలు పర్యాటక ప్యాకేజీలు, ఇతర పర్యాటక సేవలను అందించడం జరుగుతుంది. కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా వివిధ తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ఐఆర్సిటిసి టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూన్ 14 నుంచి జూలై 13వ తేదీ వరకు రెండు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజీ 1, గంగా రామాయణ పుణ్యక్షేత్ర యాత్ర జూన్ 14న ప్రారంభమై 22వ తేదీ వరకు ఉంటుంది. ఈ యాత్రలో వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగరాజ్, శృంగవర్పూర్ ప్రాంతాలు దర్శించవచ్చు. దీనికి ఒక్కొక్కరికి సాధారణ టికెట్ ధర రూ.16,200, 3ఏసీ ధర రూ.26,500, 2ఏసీ ధర రూ.35,000 ఉంటుంది.
ఇది కూడా చదవండి: ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?
ఈ యాత్ర సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తూనీ, దువ్వాడ, విజయనగరం, పలాస, బరంపూర్, భువనేశ్వర్ మీదుగా వెళుతుంది. ప్యాకేజీ 2, ఐదు జ్యోతిర్లింగ యాత్ర. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమ్ శంకర్, ఎల్లోరా, మోవ్, నాగపూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు. యాత్ర జులై 5వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొక్కరికి సాధారణ టికెట్ ధర రూ.14,700, 3ఏసీ ధర రూ.22,900, 2ఏసీ ధర 29,900 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణ మీదుగా వెళుతుంది. ఈ యాత్రలో రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం), వాటర్ బాటిల్ , టూర్ ఎస్కార్ట్ సేవలతో సందర్శన స్థలాలు, ప్రయాణ బీమా, ఇన్సూరెన్స్ అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితం. ప్రతి రైలులో 718 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు. కోచ్కి ఒక సెక్యూరిటీ గార్డు అలాగే రైలులో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందన్నారు. ఇందుకు టికెట్ బుక్ చేసుకోవాలనుకునేవారు 9701360701, 9281030712, 9281030749, 9281030750 నెంబర్లలో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు www.irctctourism.com వెబ్సైట్ ను సంప్రదించాలన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నోటీసులకు స్పందించని అమెరికా.. రాయితీలకు కోత విధించే యోచనలో భారత్!
భారత్తో వాణిజ్య ఒప్పందం ఎంతో దూరంలో లేదు! ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన..!
లాస్ ఏంజెల్స్లో మహానాడు సందడి! వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు!
అమెరికాలో మెరిసిన తెలుగు తేజం..! మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ రన్నరప్గా గుడివాడ అమ్మాయి!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Train #AndhraPradesh #Telangana #Travels
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.